అధిష్టానం గీసిన లక్ష్మణ రేఖను దాటితే అంతే సంగతులని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ స్పష్టం చేశారు. పార్టీలో క్రమశిక్షణ కోసం అధిష్టానం విధించిన నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని డీఎస్ హెచ్చరించారు.
పార్టీ నాయకులపై ఫిర్యాదులు అందిన తర్వాత వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసేముందు లేదా వారిపై చర్య తీసుకోవడానికి ముందు లోతుగా విచారణ జరిపించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని డీఎస్ అన్నారు.
ఓదార్పు యాత్రలో పాల్గొనే వారిపైనే చర్యలు తీసుకుంటున్నామన్నది సరికాదని డీఎస్ తెలిపారు. కడప ఎంపీ వై.ఎస్. జగన్ ఓదార్పులో లేనివారికీ నోటీసులు జారీ చేశామన్నారు. పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవడం తనకు ఇష్టం లేకపోయినా, పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదని డీఎస్ వివరించారు.
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
13 years ago







0 comments:
Post a Comment