రాష్ట్రంలో ఈ తెలుగుతల్లిని ఈ ఆంధ్రోళ్లు వచ్చి సృష్టించిండ్రని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలు వందేళ్ళ క్రితమే తెలంగాణ తల్లి గురించి గీతాలు రాసి పాటలు పాడుకున్నారని, మధ్యలో వచ్చిన తర్వాత అది కనుమరుగై పోయిందని కేసీఆర్ ఆరోపించారు.
దౌల్తాబాద్ సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని బుధవారం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండలేరన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజలు సుఖంగా ఉంటారని, తెలంగాణకు జరిగిన ఏ అన్యాయం విషయంలోనైనా న్యాయం జరిగిందా అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ జిల్లాల్లో ఎరువులు లభించక రైతులు అష్టకష్టాలు పడుతుంటే సీమాంధ్రలో మాత్రం భారీ ఎత్తున అక్రమ ఎరువులు బయటపడుతున్నాయని ఆయన ఆరోపించారు. అలాగే, ఈ ప్రాంత లాయర్లు తమ న్యాయమైన వాటా కోసం పోరాటం చేస్తుంటే పోలీసులతో ఆ ఆందోళనను అణగదొక్కాలని చూస్తున్నారని విమర్శించారు
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
14 years ago







0 comments:
Post a Comment