చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పరిధిలో వైఎస్సార్ కు చెందిన ఒక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపించకుండా కొంతమంది కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్ వర్గీయుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి ధ్వజమెత్తారు. విగ్రహ ప్రతిష్టాపనకు అనుమతి ఇవ్వాలంటూ పాకాల తహశిల్దార్ ఆఫీసు ఎదుట రిలే నిరాహార దీక్షకు దిగారు.
దివంగత నేత విగ్రహ ప్రతిష్టాపన చేసేందుకు తాను ముందుకు వస్తుంటే, మంత్రి గల్లా అరుణ కుమారి మోకాలడ్డుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ విగ్రహాన్ని ప్రతిష్టించే వరకూ తన పోరాటం ఆగదని హెచ్చరించారు.
అయితే పాకాల తహశిల్దార్ ఆఫీసు ఎదుట నుంచి చెవిరెడ్డి తక్షణం వెళ్లిపోవాలంటూ గల్లా అరుణ కుమారి వర్గీయులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
13 years ago







0 comments:
Post a Comment