Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Monday, October 11, 2010

NAG RAGADA PICS







Sunday, October 10, 2010

14వేల పరుగులు సాధించిన సచిన్

బెంగళూరు: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టెస్ట్ క్రికెట్‌లో మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. 14 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ఖ్యాతికెక్కాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మాస్టర్ ఈ రికార్డు సృష్టించాడు. వ్యక్తిగత స్కోరు 27 పరుగులకు చేరుకోగానే సచిన్ ఖతాలో 14 వేల పరుగులు జమయ్యాయి. ఇందులో 48 సెంచరీలు, 57 అర్థ సెంచరీలు ఉన్నాయి.

13 నుంచి నెల్లూరు జిల్లాలో ఓదార్పుయాత్ర

నెల్లూరు: తమ జిల్లాలో ఓదార్పుయాత్రను విజయవంతం చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఈ నెల 13న ఓదార్పుయాత్ర ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. 13న సాయంత్రం 4 గంటలకు రుద్రకోట నుంచి యువనేత జగన్ యాత్రకు శ్రీకారం చుడతారన్నారు. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం ఈ నెల 11 నుంచి నెల్లూరులో యాత్ర ప్రారంభం కావాల్సివుంది. ప్రకాశం జిల్లాలో ప్రజా ఒత్తిడి పెరుగుతున్నందువల్లే యాత్ర ఆలస్యమవుతోందని చంద్రశేఖర్‌రెడ్డి వివరించారు.

ఢిల్లీ చేరుకున్న సీఎం

ఢిల్లీ:ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌తో రోశయ్య ఈ రాత్రి భేటీ అయ్యేఅవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు రాయపాటి చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు వివరణ కోరగా రోశయ్య నేరుగా స్పందించలేదు. పూర్తి సమాచారం తెలుసుకున్నాక మాట్లాడతానని ఆయన తెలిపారు. 

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నిరాశ -నిస్పృహలో ఉన్నారని.. అందుకే చిల్లర మాటలు మాట్లాడుతున్నారని రోశయ్య విమర్శించారు. పరిణితి చెందిన రాజకీయ వేత్తగా చంద్రబాబు వ్యవహరించడం లేదని అన్నారు. ఒక వేళ అపాయింట్‌మెంట్ దొరికితే సోనియా, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లను కలుస్తానని రోశయ్య అన్నారు. 

నా నుంచి ఏం కావాలో అడిగితే.. అందుకు ఓకే: సమంత



నటి కాజల్ అగర్వాల్‌పై సెక్సీ సమంత ప్రశంసలు వర్షం కురిపిస్తోంది. కాజల్ చాలా టాలెంటెడ్ నటీ అనీ, మంచి మానవతా విలువలు కలిగిన వ్యక్తి అనీ కితాబిస్తోంది. నిజాయితీగా ఎలా ఉండాలో ఆమెను చూసి నేర్చుకున్నాను అంటోంది.

ఇద్దరూ కలిసి జూనియర్ ఎన్టీఆర్ 'బృందావనం' చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. తాను చిత్రంకోసం ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నానని చెప్పింది. పాత్ర గురించి చెప్పమంటే చెప్పకుండా దాటవేస్తూ.. మంచి పాత్ర పోషించానని అంది.

తక్కువ సమయంలోనే పెద్ద హీరో సరసన నటించే అవకాశం రావడం లక్కీగా భావిస్తున్నానని పేర్కొన్నారు. 'ఏ మాయ చేసావె' చిత్రంలోని పాత్రకంటే గ్లామర్ పాత్రలు చేస్తావా...? అని అడిగితే... నా నుంచి ఏమి ఆశిస్తారో దాన్ని చేయడానికి నేను రెడీ అని బదులిచ్చింది.

కాగా సమంత తాజాగా మహేష్ బాబుతో 'దూకుడు' చిత్రంలో నటిస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌లో పాల్గొంటానని చెప్పింది.

11న బలపరీక్షను ఎదుర్కోనున్న సీఎం యడ్యూరప్ప!

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప సోమవారం బలపరీక్షను ఎదుర్కోనున్నారు. తన మంత్రివర్గంలోని అవినీతి మంత్రులపై చర్య తీసుకున్నందుగాను సొంత పార్టీకి చెందిన 13 ఎమ్మెల్యేలతో పాటు.. మొత్తం 19 మంది సభ్యులు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే.

అసమ్మతి సభ్యులతో ఆ రాష్ట్ర మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి జరిపిన చర్యలు ఫలించడంతో కొంతమంది రెబల్ అభ్యర్థులు తిరిగి సొంతగూటికి చేరుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే, 11 మంది సభ్యులు మాత్రం యడ్యూరప్ప సర్కారుకు మద్దతు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు.

వీరికి జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పూర్తి అండదండగా నిలుస్తున్నారు. వీరిని గోవా నుంచి చెన్నయ్‌కు తరలించి మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప సోమవారం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనున్నారు.

ఆయన సర్కారు కొనసాగాలంటే మొత్తం 113 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంది. అయితే, 11 మంది సభ్యులు తిరుగుబాటు చేయడం, కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకుండా ఆయా పార్టీలు విప్ జారీ చేయడంతో యడ్యూరప్ప సర్కారు ప్రమాదం అంచున ఉంది.

కర్ణాటకలో ప్రతిపక్షాల కుట్రను తిప్పికొడతాం: వెంకయ్య

కర్ణాటకలోని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కాంగ్రెస్, జేడీఎస్ వంటి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఆయన ఆదివారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ.. కర్ణాటక రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్, జేడీఎస్‌లో ప్రధాన కారణమన్నారు.

కర్ణాటక రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్.. జేడీఎస్‌తో కలిసి ఈ జిమ్మిక్కులకు పాల్పడుతోందన్నారు. సోమవారం జరిగే బలపరీక్షలో తప్పకుండా యడ్యూరప్ప విజయం సాధించి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటారన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా నడుచుకుంటే మాత్రం వేటు తప్పది ఆయన హెచ్చరించారు.

జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషిస్తూ తమ పార్టీ ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురిచేసి కిడ్నాప్ చేశారని వెంకయ్య నాయుడు ఆరోపించారు. ఇటీవలి కాలంలో కర్ణాటకలో 16 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయిందని వెంకయ్య గుర్తు చేశారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ తథ్యం: కేకే

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ముందుకు వచ్చే అందరినీ కలుపుకుని ముందుకు పోతామన్నారు.

ముఖ్యమంత్రి రోశయ్య పనితీరు బాగావుందన్నారు. అందువల్ల ఆయన మార్చాల్సిన పని లేదన్నారు. కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న వ్యక్తిగత ఓదార్పు యాత్రపై తానేమీ వ్యాఖ్యానించబోనన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సజావుగా సాగుతోందన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు దిక్కతోచకనే రాష్ట్ర పర్యటనలు జరుపుతున్నారన్నారు. తన ఇమేజ్‌ను ఏ విధంగా కాపాడుకోవాలనే తపన ఆయనలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు. గద్దర్ నేతృత్వంలో ఏర్పాటైన తెలంగాణ ప్రజా ఫ్రంట్‌తో కూడా సంప్రదింపులు జరిపి ముందుకెళతామని చెప్పారు

కేసీఆర్ ఓ దొంగ.. ఆయన దీక్షా ఓ మోసపూరితం: గోనే

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు ఒక దొంగ అని, ఆయన గత యేడాది డిసెంబరులో చేపట్టిన నిరాహారదీక్ష కూడా ఓ మోసపూరితమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గోనె ప్రకాశరావు ఆరోపించారు. ఆయన ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్న సమయంలో అన్ని రకాల విటమిన్స్ అందాయన్నారు.

అది నిజమైన దీక్ష కాదన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ నేతృత్వంలో ఏర్పాటైన తెలంగాణ ప్రజాఫ్రంట్‌తో కేసీఆర్‌కు దిక్కుతోచడం లేదన్నారు. అందుకే మరోమారు ఆమరణదీక్ష చేపట్టేందుకు సై అంటూ ప్రజలను మోసం చేసే ప్రకటనలు చేస్తున్నారని గోనే ఆరోపించారు.

కేసీఆర్‌ను నిమ్స్ ఆస్పత్రిలో చేరిన తర్వాత అన్ని రకాల విటమిన్స్ అందుతున్న విషయం ప్రభుత్వానికి బాగా తెలుసన్నారు. ఈ విషయాలను కావాలనే కొంతమంది నేతలు కేంద్రానికి తెలియజేయలేదని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఇక్కడ ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైందని గోనే ప్రకాశ రావు ధ్వజమెత్తారు

విజయనగరంలో ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు: సబ్బం హరి

పార్లమెంట్ సమావేశాలు తర్వాత విజయనగరం జిల్లాలో కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను చేపట్టనున్నట్టు అనకాపల్లి ఎంపీ సబ్బం హరి వెల్లడించారు. ఈ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. 
దీనిపై ఆయన విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ ఓదార్పు యాత్రను నిలుపుదల చేసే ప్రసక్తే లేదన్నారు. ఓదార్పుయాత్ర జగన్ వ్యక్తిగతమని, ఆయనపై అధిష్టానం ఎటువంటి చర్య తీసుకోదన్నారు. కొందరు కావాలనే ఓదార్పుయాత్రపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. 
తన తండ్రి హఠాన్మరణం అనంతరం మృత్యువాత పడిన కుటుంబ సభ్యులను పరామర్శించడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. జగన్‌పై కాంగ్రెస్ అధిష్టానం చర్య తీసుకుంటుందనే తలంపు ఎందుకు వస్తుందన్నారు. కొంతమంది చేసే అసత్య ప్రచారం వల్లే మీడియా ఇలాంటి ప్రశ్నలు వేస్తోందన్నారు.

తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి ముస్లి నేత: కేసీఆర్



తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తొలి ఉప ముఖ్యమంత్రి పదవిని ముస్లిం నేతకు ఇవ్వడమే కాకుండా, మైనారిటీ వర్గానికి చెందిన ఐదుగురిని మంత్రులను చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. ఆయన ఆదివారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. 
ముస్లింలకు ఆది నుంచి అన్యాయం జరుగుతోందన్నారు. 

ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ముస్లింను ఉప ముఖ్యమంత్రి చేస్తామని, ఐదుగురికి మంత్రి పదవులిస్తామని ఆయన హామీయిచ్చారు. సీమాంధ్ర నేతలకు ఇక్కడి ముస్లింల సంస్కృతి గురించి తెలియదని కేసీఆర్ అన్నారు. తెలంగాణ వస్తే వక్ఫ్ బోర్డ్ భూములను ఇంచు కూడా కబ్జా కానివ్వబోమన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మరెంతో దూరంలో లేదన్నారు. గత యేడాది డిసెంబరులో కేంద్రం చేసిన ప్రకటనను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అడ్డుపడక పోతే రాష్ట్ర ఏర్పాటు కల సాఫల్యమై వుండేదన్నారు. అలాగే, సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం నిజమైనది కాదని, పెట్టుబడిదారులు సృష్టించిన కృత్రిమ ఉద్యమం అని కేసీఆర్ అన్నారు

Monday, October 4, 2010

మళ్లీ మొదలైన ప్రభుదేవా పెళ్లి లొల్లి



ఆల్ ఇండియా మైకేల్ జాక్సన్ ప్రభుదేవా తనతోనే ఉండేలా న్యాయస్థానం ఆదేశాలు జారీ చెయ్యవలసిందిగా కోరుతూ ఆయన భార్య రమాలత్ ఈ రోజు చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఐతే ఇటీవల ప్రభుదేవా తన భార్యతో ఒక ఒప్పందానికి వచ్చినట్లు ఒప్పందం ప్రకారం ఆమె కోరినంత ధనంతో పాటు తన ప్రేయసి నయనతారకు తొలికలయికలో బహుమతిగా ఇచ్చిన నక్లెస్ మరియు ఓ ఇంటిని కూడా రామాలత్ కు ఇచ్చేందుకు ప్రభు సిద్దమైనట్లు సమాచారం. 

ఈ వార్త విన్న సినీ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కూడా నయనతారతో ప్రభుదేవా పెళ్ళికి లైన్ క్లియర్ అయ్యింది అనుకున్న సమయంలో రామాలత్...నేడు ఒక్కసారిగా రేపిన దుమారంతో అందరూ అవాక్కయ్యారు. ఐతే ప్రభుదేవా కనీసం కుటుంబ ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకుండా బాధ్యతలను విస్మరిస్తున్నాడంటూ రామాలత్ తాను దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. డబ్బుతో ప్రమేయం లేకుండా ప్రభుదేవా తనతో ఉండేలా కోర్టు ఆదేశించవలసిందిగా ఆమె ఫ్యామిలీ కోర్టును కోరింది.