Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Tuesday, August 31, 2010

మేరీ మాత కలలోకి వచ్చింది: పవన్ కల్యాణ్



పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఏసుక్రీస్తు నేపధ్యంగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ను జెరూసలేంలో చేస్తున్నారు. మంగళవారం చిత్ర నిర్మాత కొండా కృష్ణంరాజు, హీరో పవన్ కల్యాణ్ టెలీకాన్ఫెరెన్స్ ద్వారా విలేకరులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌తో మాటామంతీ...

ఏసుక్రీస్తు.. అంటే భక్తిరస ప్రధాన చిత్రంలో ఎందుకు చేయాలనుకున్నారు..? 
ఒకరోజు మా అబ్బాయి పొరపాటున కిందపడిపోయాడు. దాంతో వాడి మోకాలికి గాయం అయింది. వాడు బాధపడుతుంటే ఆ దెబ్బ నాకే తగిలినంత ఫీల్ అయ్యాను. ఎందుకో తెలియదు.. ఆ క్షణంలో మేరీమాత గుర్తుకు వచ్చింది. తన కుమారుడు క్రీస్తును చిత్ర హింసలు పాల్జేస్తుంటే ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లి ఉంటుందో అనిపించింది. 

అలా ఆ రాత్రి ఆ ఆలోచనలతోనే నిద్రపోయా. ఉదయం లేచేసరికి కొండా కృష్ణంరాజుగారు ఏసుక్రీస్తుపై చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు చెప్పారు. పైగా ఆ చిత్రంలో నన్ను నటించమని అడిగారు. ఇంకేముంది ఆ మేరీమాతే ఈ పనికి సంకల్పించి ఉంటుందని అంగీకరించా.

క్రైస్తవులకు సంబంధించి మీకు ఏమీ తెలియదు. మరి సినిమాలో ఎలా చేస్తారు..? 
నా స్కూలు చదువంతా మిషనరీ స్కూల్లోనే సాగింది. నాకు చాలామంది క్రైస్తవ స్నేహితులున్నారు. 

కమర్షియల్ హీరోగా ముద్రపడిన మీరు ఆధ్యాత్మిక చిత్రాలవైపు మళ్లడం.. కెరీర్‌కు ఇబ్బంది కాదా..? 
అలాంటిదేమీ ఉండదు. పాత్రలో దమ్ము ఉండాలి. అటువంటి పాత్ర దొరికినపుడు అది ఆధ్యాత్మికమా.. మరొకటా అని చూడను. నచ్చితే చేసేందుకు నేను ఎప్పుడూ సిద్ధమే.

సరే.. ఇపుడు క్రైస్తవులకు సంబంధించి చేస్తున్నారు... భవిష్యత్తులో హిందూ దేవుళ్లకు సంబంధించి ఏదైనా చిత్రంలో నటిస్తారా..? 
అలాంటి బేధాలేమీలేవు. మన దేశం అనేక మతాల సమ్మేళనం. అన్ని మతాలు సమానమే. నేను ముందు చెప్పినట్లుగా పాత్ర నచ్చితే నటించడానికి నేను సిద్ధమే.

అసలు ఈ చిత్రాన్ని చేయడం వెనుక ఎవరిదైనా ప్రభావం ఉన్నదా...? 
బహుశాః నాకు తెలిసి ఒక సంఘటన నాపై తీవ్రంగా ప్రభావం చూపిందనే చెప్పాలి. ఒరిస్సాలో ఒక వ్యక్తి మతమార్పిడికి పాల్పడుతున్నాడంటూ అతడిని కొందరు హతమార్చారు. ఆ తర్వాత హత్యకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి శిక్ష పడే తరుణంలో హతుని భార్య వారినందరినీ క్షమిస్తున్నట్లు ప్రకటించి వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అభ్యర్థించింది. నిజంగా ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేనిది. అంతటి క్షమాగుణం కొందరికే సాధ్యం. వారు భగవంతులతో సమానమే.

ఏసుక్రీస్తు చిత్రంలో మీ పాత్ర ఎటువంటిది..? 
ఇది మాత్రం మీరు వెండితెరపై చూడాల్సిందే అని ముగించారు పవన్ కల్యాణ్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఏసుక్రీస్తు నేపధ్యంగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ను జెరూసలేంలో చేస్తున్నారు. మంగళవారం చిత్ర నిర్మాత కొండా కృష్ణంరాజు, హీరో పవన్ కల్యాణ్ టెలీకాన్ఫెరెన్స్ ద్వారా విలేకరులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌తో మాటామంతీ...

ఏసుక్రీస్తు.. అంటే భక్తిరస ప్రధాన చిత్రంలో ఎందుకు చేయాలనుకున్నారు..? 
ఒకరోజు మా అబ్బాయి పొరపాటున కిందపడిపోయాడు. దాంతో వాడి మోకాలికి గాయం అయింది. వాడు బాధపడుతుంటే ఆ దెబ్బ నాకే తగిలినంత ఫీల్ అయ్యాను. ఎందుకో తెలియదు.. ఆ క్షణంలో మేరీమాత గుర్తుకు వచ్చింది. తన కుమారుడు క్రీస్తును చిత్ర హింసలు పాల్జేస్తుంటే ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లి ఉంటుందో అనిపించింది. 

అలా ఆ రాత్రి ఆ ఆలోచనలతోనే నిద్రపోయా. ఉదయం లేచేసరికి కొండా కృష్ణంరాజుగారు ఏసుక్రీస్తుపై చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు చెప్పారు. పైగా ఆ చిత్రంలో నన్ను నటించమని అడిగారు. ఇంకేముంది ఆ మేరీమాతే ఈ పనికి సంకల్పించి ఉంటుందని అంగీకరించా.

క్రైస్తవులకు సంబంధించి మీకు ఏమీ తెలియదు. మరి సినిమాలో ఎలా చేస్తారు..? 
నా స్కూలు చదువంతా మిషనరీ స్కూల్లోనే సాగింది. నాకు చాలామంది క్రైస్తవ స్నేహితులున్నారు. 

కమర్షియల్ హీరోగా ముద్రపడిన మీరు ఆధ్యాత్మిక చిత్రాలవైపు మళ్లడం.. కెరీర్‌కు ఇబ్బంది కాదా..? 
అలాంటిదేమీ ఉండదు. పాత్రలో దమ్ము ఉండాలి. అటువంటి పాత్ర దొరికినపుడు అది ఆధ్యాత్మికమా.. మరొకటా అని చూడను. నచ్చితే చేసేందుకు నేను ఎప్పుడూ సిద్ధమే.

సరే.. ఇపుడు క్రైస్తవులకు సంబంధించి చేస్తున్నారు... భవిష్యత్తులో హిందూ దేవుళ్లకు సంబంధించి ఏదైనా చిత్రంలో నటిస్తారా..? 
అలాంటి బేధాలేమీలేవు. మన దేశం అనేక మతాల సమ్మేళనం. అన్ని మతాలు సమానమే. నేను ముందు చెప్పినట్లుగా పాత్ర నచ్చితే నటించడానికి నేను సిద్ధమే.

అసలు ఈ చిత్రాన్ని చేయడం వెనుక ఎవరిదైనా ప్రభావం ఉన్నదా...? 
బహుశాః నాకు తెలిసి ఒక సంఘటన నాపై తీవ్రంగా ప్రభావం చూపిందనే చెప్పాలి. ఒరిస్సాలో ఒక వ్యక్తి మతమార్పిడికి పాల్పడుతున్నాడంటూ అతడిని కొందరు హతమార్చారు. ఆ తర్వాత హత్యకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి శిక్ష పడే తరుణంలో హతుని భార్య వారినందరినీ క్షమిస్తున్నట్లు ప్రకటించి వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అభ్యర్థించింది. నిజంగా ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేనిది. అంతటి క్షమాగుణం కొందరికే సాధ్యం. వారు భగవంతులతో సమానమే.

ఏసుక్రీస్తు చిత్రంలో మీ పాత్ర ఎటువంటిది..? 
ఇది మాత్రం మీరు వెండితెరపై చూడాల్సిందే అని ముగించారు పవన్ కల్యాణ్

నక్సలిజం అణిచివేతలో పనితీరు భేష్: గిరీష్ కుమార్

రాష్ట్రంలో నక్సలిజాన్ని అణిచి వేయడంలో రాష్ట్ర పోలీసు శాఖ పనితీరు భేషుగ్గా ఉందని రాష్ట్ర డీజీపీ గిరీష్ కుమార్ అన్నారు. అదేసమయంలో రాష్ట్ర డీజీపీ విధులు నిర్వర్తించినందుకు చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.

గిరీష్ కుమార్ పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆయన పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. అంబర్‌పేట సీపీఎల్‌లో జరిగిన ఫేర్‌వెల్ పెరేడ్‌ కార్యక్రమానికి పలువురు సీనియర్ ఐపీఎస్‌ అధికారులు, ఎస్పీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు.

Monday, August 30, 2010

జగన్.. చెప్పుడు మాటలు విని భవిష్యత్ పాడుచేసుకోకు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొంతమంది నాయకుల మాటలు విని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని రాష్ట్ర వైద్యశాఖామంత్రి దానం నాగేందర్ హితవు పలికారు. జగన్‌కు రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉన్నదనీ, కానీ కొంతమంది నాయకులు ఆయన చెవెమ్మట జోరీగలా మారి ఆయన భవిష్యత్తును పాడుచేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు.

అధిష్ఠానం మాటలు జగన్ మంచికోసమే తప్ప, ఆయన ఎదుగుదలకు అడ్డుగోడగా నిలిచేవి కావని అభిప్రాయపడ్డారు. కొంతమంది నాయకులు జగన్‌కు అధిష్ఠానానికి మరింత దూరాన్ని పెంచడమే పనిగా పెట్టుకున్నారన్నారు.

వైఎస్సార్ ప్రథమ వర్థంతిని ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నాగేందర్ వెల్లడించారు.

స్వార్ధం @ ఏ ఐ సీసీ









దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, డీసీసీ అధ్యక్షులు కలిసి బాధితులను గుర్తించి జాబితాను రూపొందిస్తారని ఏఐసీసీ పేర్కొంది. 

వైఎస్ మృతిని తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సంఖ్యలో అనేక మంది ప్రజలు మరణించిన విషయం తెల్సిందే. ఈ కుటుంబాలను కడప ఎంపీ, వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తూ తన వంతు ఆర్థికసాయం చేస్తున్నారు. 

దీన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా పరిగణించింది. పార్టీ నియమావళికి వ్యతిరేకంగా జగన్ వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్‌కు చెక్ పెట్టేలా కాంగ్రెస్ హైకమాండ్ పావులు కదిపింది. 

ఇందులోభాగంగా, వైఎస్ హఠాన్మరణంతో మృతి చెందిన వారి కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. బాధితులను పీసీసీ చీఫ్, డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు కలిసి ఎంపిక 
ఆర్థిక సాయం పట్ల కాంగ్రెస్ వర్గాలు హర్షం వ్యక్తం చేసాయి 





Sunday, August 29, 2010

NAG

నేడు గిడుగు జయంతి: తెలుగు మాతృభాషా దినోత్సవం




తెలుగు మాతృభాషా దినోత్సవాన్ని రాష్ట్ర పజలు జరుపుకుంటున్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు 147వ జయంతిని మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. విశిష్ట వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన పెద్దపీట వేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో 1863 ఆగస్టు 29న వీర్రాజు, వెంకమ్మ దంపతులకు గిడుగు జన్మించారు.

ఆ తర్వాత ఏవీఎన్ కాలేజీ ప్రధానాధ్యాపకుడు శ్రీనివాస అయ్యంగార్, గురజాడ అప్పారావు, యేట్స్, గిడుగు రామమూర్తి పంతులు కలిసి వ్యావహారిక భాషలో బోధనోద్యమానికి శ్రీకారం చుట్టారు. అప్పటికే రామమూర్తి వ్యావహారిక భాషలో బోధన కోసం ప్రచారం చేయడం ఆరంభించారు. ఇందుకోసం ఆయన తెలుగు అనే పత్రికను గిడుగు ప్రారంభించారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

వైఎస్ - రోశయ్యల బంధం విడదీయరానిది: వైఎస్.వివేకా

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత సీఎం కె.రోశయ్యల మధ్య ఉన్న బంధం విడదీయరానిదని ఎమ్మెల్సీ వైఎస్.వివేకానంద రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన పశ్చిమగోదావరి జిల్లా, సత్యవోలులో వైఎస్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ది పథకాలను ఏకకాలంలో రెండు కళ్లలా వైఎస్ అమలు చేశారన్నారు. ఈ పథకాలకు వీటికి నిధుల కొరత లేకుండా అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య ఎంతో సమర్థంగా వ్యవహరించారని చెప్పారు. 

ఓ పక్క అప్పులు తీరుస్తూనే మరో పక్క అన్ని పథకాలకూ బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారన్నారు. అందువల్ల వారిద్దరిది మేలి కలయికగా ఆయన అభివర్ణించారు. ప్రజాభిమానం గల యువనేత వైఎస్ జగన్‌ను కాంగ్రెస్ అధిష్టానం దీవించాలని అందరూ కోరుకుంటున్నారని వివేకా చెప్పుకొచ్చారు. 
ప్రజాభిప్రాయాన్ని కాంగ్రెస్ అధిష్టానం తప్పకుండా గౌరవిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ అమలుచేయని సంక్షేమ అభివృద్ధి పథకాలను వైఎస్ హయాంలో చేపట్టారన్నారు. వాటిని ఇకపై కూడా కొనసాగించాలని ఆయన కోరారు.

Friday, August 27, 2010



కధ-స్క్రీన్ ప్లే - దర్శకత్వం - అప్పలరాజు -రామ్ గోపాల్ వర్మ

కధ-స్క్రీన్ ప్లే - దర్శకత్వం - అప్పలరాజు  చిత్రం ఈరోజు    హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది  ముఖ్య అతిధులు గా శ్రీదేవి బోనికపూర్ , అక్కినేని నాగార్జున తదితరులు హాజరు అయ్యారు ఈ  సినిమా ప్రారంభం కార్యక్రమ౦ లో దర్శకులను దెప్పి తు ఒక పాటను దర్శకుడు రాంగోపాల్ వర్మ వినిపించారు ఈ పాట వినిపించడం వల్ల సినిమా పయిన ఇంకా ఆసక్తి పెరిగింది  అని కొందరు అభిప్రాయ పడ్డారు ఏది ఏమయినా మన వర్మ స్టైల్ ఏ వేరు లక్ తో శివ సినిమా  తీసి  షోలే ను చెడగొట్ట అంటూ ప్రారభం అయ్యే ఈ పాట పెద్ద హిట్ అవ్వడం ఖాయం






టాలీవుడ్ "కింగ్" నాగార్జున లాంటి యంగ్ అండ్ డైనమిక్, ఎనర్జిటిక్ స్టార్ ఇంకెవ్వరూ లేరని అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి అన్నారు. నాగార్జునతో టాలీవుడ్‌లో నటించడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె వెల్లడించారు. చాలాకాలం తర్వాత తెలుగు వారందరినీ కలుసుకునే అవకాశం వచ్చిందన్నారు. 

నాగ్ చాలా హార్డ్‌వర్కర్, అతనిలా కో-ఆపరేట్ చేసే యాక్టర్ మరొకరు లేరని కితాబిచ్చింది. సినీ ప్రపంచంలో తాను ఈ స్థాయికి ఎదగడానికి దర్శకులు, ప్రత్యేకంగా రాఘవేంద్రరావు, నిర్మాతలు, ప్రేక్షకులు, అభిమానుల ఆదరణే ప్రధాన కారణమని చెప్పారు. సినీ ప్రపంచంలో తాను గొప్ప స్థాయికి ఎదగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తాను రుణపడి ఉన్నానన్నారు.

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా రూపుదిద్దుకోనున్న కొత్త చిత్రం "కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రావు"కు క్లాప్ కొట్టేందుకు శ్రీదేవి, బోనీకపూర్ దంపతులు హైదరాబాద్‌కు వచ్చారు. అన్నపూర్ణ స్టూడియోలో సునీల్-రామ్‌గోపాల్ వర్మ కొత్త సినిమా శుక్రవారం ఆరంభమైంది. ప్రముఖ హాస్యనటుడు, హీరో సునీల్‌పై తీసిన ముహూర్తపు షాట్‌కు అతిలోక సుందరి శ్రీదేవి, కింగ్ నాగార్జున క్లాప్ కొట్టి ఆరంభించారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ.. శ్రీదేవితో ఆఖరి పోరాటం నటించే సమయంలో చాలా జడుసుకున్నానన్నారు. మిస్ ఇండియాతో నటించడమంటే కాస్త భయమేసిందని, కానీ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, శ్రీదేవి సహకారంతో ఆ చిత్రంలో నటించానని నాగ్ చెప్పారు. అలాగే రామ్ గోపాల్ వర్మతో కొత్త చిత్రం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కింగ్ అన్నారు. "రామ్ నీతో సినిమా చేసేందుకు నేను రెడీ. ఎంత టైమ్ అయినా ఫర్లేదు. నేనెప్పుడూ యంగ్‌గా ఉంటానని" చలోక్తి విసిరారు.

ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, నాగార్జున, రానా, నాగచైతన్య, నితిన్, సుమంత్, కలర్స్ స్వాతి తదితరులు హాజరయ్యారు.

Saturday, August 21, 2010

అబ్బే.. ఆ కమిటీ రాష్ట్ర విభజన కోసం కాదు: కేంద్రం

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కోసం కాదని కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తేల్చి చెప్పింది. గత యేడాది డిసెంబరు తొమ్మిదో తేదీ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల అధ్యయనం కోసమే ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు దేశ అత్యున్నత న్యాయస్థానానికి కేంద్రం తెలియజేసింది.

రాష్ట్ర విభజనం కోసం కేంద్రం.. శ్రీ కృష్ణ కమిటీ ఏర్పాటుతో పాటు, రాజ్యాంగంలోని మూడవ అధికరణానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించటాన్ని సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన సమతా పార్టీ జాతీయ నేత, సమైక్యాంధ్ర ప్రతినిధి వి.వి.కృష్ణారావు, తిరుపతికి చెందిన కె.పుష్పలత ఈ ఏడాది ఫిబ్రవరి ఐదో తేదీన సుప్రీం కోర్టులో పిటీషన్‌ను దాఖలు చేశారు.

ఈ పిటీషన్‌పై జస్టిస్ కపాడియా, రాధాకృష్ణన్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటీషనర్ల తరపున హరీశ్‌సాల్వే వాదించారు. పిటీషనర్లు లేవనెత్తిన మౌలిక అంశాలు, శ్రీకృష్ణ కమిటీపై తమకు సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు పంపగా, వీటిపై కేంద్రం తగిన రీతిలో సమాధానం ఇచ్చింది. కేంద్రం సమర్పిచిన సమాధాన పత్రంలో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన కోసం మాత్రం కమిటీని ఏర్పాటు చేయలేదని తేల్చిచెప్పింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు, అధ్యయనం చేసేందుకు మాత్రమే ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించినట్టు కేంద్రం ఏనాడూ ప్రకటించలేదని కూడా సుప్రీంకోర్టుకు పంపిన సమాధాన పత్రంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం గమనార్హం. కేంద్రం తాజా సమాధానంపై తెలంగాణ ప్రాంత నేతలు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Monday, August 9, 2010

రాజీనామా యోచన దిశగా వైఎస్.విజయలక్ష్మి?

పులివెందుల శాసనసభ సభ్యురాలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్.విజయలక్ష్మీ తన సభ్యత్వానికి రాజీనామా చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తన భర్త హఠాన్మరణం అనంతరం తమ కుటుంబం పట్ల కాంగ్రెస్ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరి ఆమెకు ఆగ్రహాన్ని తెప్పించినట్టుగా ఉంది. అందుకే.. కాంగ్రెస్ భిక్షతో వచ్చిన ఎమ్మెల్యే పదవికి గుడ్‌బై చెప్పాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్టు జగన్ సన్నిహిత వర్గాల సమాచారం.

దీనిపై రెండు మూడు రోజుల్లో ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత తన భర్త మొదటి వర్థంతి రోజైన సెప్టెంబరు రెండో తేదీన ఇడుపులపాయలో శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం రాజీనామా పత్రాన్ని పార్టీ అధిష్టానానికి నేరుగా పంపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిద్వారా మహిళా సెంటిమెంట్‌ను పొందవచ్చని జగన్ వర్గం వ్యూహంగా ఉంది.

వైఎస్.విజయలక్ష్మి రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఆమె బాటలో మరికొంతమంది ఎమ్మెల్యేలు పయనిస్తారని జగన్ వర్గం భావిస్తోంది. తద్వారా తమ పట్ల చిన్నచూపు చూస్తున్న అధిష్టానానికి షాక్ ఇచ్చి వారి కళ్లు తెరిపించవచ్చన్నది వారి భావనగా ఉంది. విజయమ్మ రాజీనామా చేసిన మరుక్షణమే శాయంపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

వైఎస్‌లేని మంత్రివర్గంలో తాను కొనసాగలేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసి తన మంత్రిపదవి తృణప్రాయంగా త్యజించిన వైఎస్ వీరాభిమాని కొండా సురేఖ కావడం గమనార్హం. మొత్తంమీద వైఎస్.విజయలక్ష్మి తీసుకునే రాజీనామా నిర్ణయం రాష్ట్ర కాంగ్రెస్ సర్కారులో పెనుప్రకంపనలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి

Sunday, August 8, 2010

మళ్లీ వస్తున్న మీ కోసం

సమాజానికి మేలు చేసే, ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చే అద్భుతమైన స్క్రిప్ట్ లభిస్తే ఆ చిత్రంలో నటించేందుకు ఏమాత్రం వెనుకంజ వేయబోనని ప్రజారాజ్యం పార్టీ అధినేత, మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. 'రోబో' చిత్రం ఆడియో ఫంక్షన్‌లో తాను చేసిన వ్యాఖ్యలు ఒక కళాకారుడిగా తన మనస్సులోని మాటలను వ్యక్తం చేశానన్నారు. దీనిపై పెడార్థాలు తీయడం సమంజసం కాదని విజ్ఞప్తి చేశారు.

నెల్లూరు జిల్లా కేంద్రంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. మూడు దశాబ్దాల పాటు కళాకారుడిగా ఉన్నానన్నారు. కళామతల్లిని వదిలి రాజకీయ రంగంలోకి వచ్చినంత మాత్రాన తనలోని కళాతృష్ణను చంపుకోలేనన్నారు. మంచి చిత్రాలు చూసేటపుడు ఇలాంటి చిత్రం మనం చేస్తే ఎలావుండేదనో.. లేక చేయలేక పోయామనో భావన ఒక కళాకారుడిగా తనకు కలుగుతుందన్నారు.

అందువల్ల భవిష్యత్‌లో అద్భుతమైన స్క్రిప్ట్ లభించి, దానికి తన వల్లే న్యాయం జరుగుతుందని భావిస్తే ఖచ్చితంగా ఆ చిత్రంలో నటించేందుకు వెనుకంజ వేయబోనన్నారు. ముఖ్యంగా, తాను నటించే చిత్రం ప్రజలకు మంచి సందేశం ఇస్తుందని, బాగా చైతన్య వంతులు చేస్తుందని అనుకుంటే తప్పకుండా చేస్తానని చిరంజీవి తేల్చి చెప్పారు.




Saturday, August 7, 2010

కేసీఆర్ పార్టీని భూస్థాపితం చేసే రోజు వస్తుంది: చంద్రబాబు


రాష్ట్ర సమితి ఉపపార్టీ.. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ. తెలుగువారికోసం పుట్టిన పార్టీ. తెలుగువారికి సేవ చేసేందుకు ఆవిర్భవించిన పార్టీ. నేను తెలంగాణా - సీమాంధ్ర ప్రాంతాలకు ఉమ్మడి నాయకుడ్ని. ఏ ఒక్క ప్రాంతం నాకు ఎక్కువ కాదు... అలాగని తక్కువా కాదు. రెండు ప్రాంతాలు నాకు రెండు కళ్లు లాంటివి" అంటూ చంద్రబాబు నాయుడు తెలంగాణా అంశంపై స్పష్టమైన వైఖరిని తొలిసారిగా మీడియా ముందు ఆవిష్కరించారు.

తెలంగాణాపై తెలుగుదేశం పార్టీ దాగుడుమూతలు ఆడుతుందన్న విమర్శలను ఆయన కొట్టి పారేశారు. సున్నితమైన అంశంపై ఎక్కువ మాట్లాడటం కుదరదనీ, అయితే రెండు ప్రాంతాల ప్రజల మనోభావాలకు తగ్గట్లుగానే తమ పార్టీ ముందుకు పోతోందని బాబు అన్నారు.

9 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రింగా పనిచేసిన తనను రాష్ట్రంలోని రెండు ప్రాంతాల ప్రజలు గౌరవించారన్నారు. అటువంటిది ఏదో సమస్య వచ్చిందని ఒక ప్రాంతాన్ని వదులుకుని, మరో ప్రాంతానికి మద్దతు పలుకడం భావ్యం కాదన్నారు.

అసలు తెలంగాణాలో అభివృద్ధి ఏదైనా జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని బాబు పేర్కొన్నారు. అటువంటి తెలుగుదేశం పార్టీని తెలంగాణా రాష్ట్ర సమితి పనిగట్టుకుని విమర్శించడం తగదన్నారు. రెండు ప్రాంతాల్లోనూ రెండు విధాలుగా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీని తెరాస ఎందుకు విమర్శించదో చెప్పాలని బాబు డిమాండ్ చేశారు.

కేసీఆర్ తెదేపాను తెలంగాణా ద్రోహులుగా అభివర్ణించడంపై స్పందిస్తూ.... ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చాడన్న సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. తెలంగాణాలో తమకు బలమైన క్యాడర్ ఉందనీ, తెరాస భూస్థాపితమయ్యే రోజు వస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు.

తెలంగాణా అంశంపై శ్రీకృష్ణ కమిటీతో భేటీ అయ్యేందుకు మీకు అభ్యంతరం ఉందంటున్నారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, మా పార్టీలోని అందరు నాయకులు కమిటీతో మాట్లాడతారు. ఇందులో ఎటువంటి సందేహానికి తావులేదన్నారు.

రజనీకాంత్ నన్ను మోసం చేశాడు: చిరంజీవి


"రజనీ నన్ను మోసం చేశాడు. తాను రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ పెద్ద ప్రచారం జరిగింది. ఇద్దరం మాట్లాడుకున్నాం... ఆయన వస్తున్నాడని నేను రాజకీయాల్లోకి వచ్చా. ఒక్కసారి వెనక్కి తిరిగితే.. రజనీ రాకపోగా.. రోబో సినిమాలో ఉన్నాడు. నన్ను గేటు బయటకు తోసి ఆయన లోపలే ఉన్నాడు. రోబో ట్రైలర్ చూశాక.. నాలో మళ్లీ నటించాలన్న కోరిక కలుగుతోంది. నా ఫ్యాన్స్ అడిగినా చేయనని చెప్పాను. కానీ ఇప్పుడు చేయాలనిపిస్తుంది అంటూ రోబో సినిమా ఘనవిజయాన్ని సొంతం చేసుకోవాల"ని కోరారు. 140 కోట్ల రూపాయల బడ్జెట్ ముందుగా సన్ పిక్చర్స్ సీఈఒ సక్సేనా మాట్లాడుతూ... ఈ చిత్రానికి ఏర్పడిన అవరోధాలు.. ఆ తర్వాత ఎలా గట్టెక్కామో వివరించారు. ఇటీవలే తమిళ ఆడియోను మలేషియాలో చేశాం. తర్వాత హిందీ వెర్షన్‌ను ముంబయిలో చేయబోతున్నాం అని చెప్పారు. సెప్టెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామనీ, ఎప్పుడనేది త్వరలో వెల్లడిస్తామన్నారు. అలాగే ఎన్ని ప్రింట్లనేవి కూడా ప్రస్తుతానికి చెప్పలేమన్నారు. రజనీకాంత్ సైంటిస్ట్‌గా, రోబోగా నటించారు. మరో పాత్రను కూడా పోషించారు. అది సస్పెన్స్. ఆ పాత్ర అదిరిపోయినట్లుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ దీనికి పనిచేసారు. 1500 కంప్యూర్ షాట్స్ ఇందులో ఉన్నాయి. ఇంగ్లీషు చిత్రాలైన మమ్మీ, 2011 చిత్రాల స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. శ్రీనివాస్ అనే ఆంధ్రకు చెందిన విజువల్ ఇంజనీర్ పనిచేశారు. అలాగే కుంగ్ ఫూ సినిమాలకు పనిచేసిన ఫ్రాంకీ‌చెన్‌తో యాక్షన్ ఎపిసోడ్ చేశాం. పీటర్ హేన్స్ కూడా కొన్ని చేశాడు. రెండున్నర సంవత్సరాల కష్టం ఇది. ఎడిటర్ రెండున్నరేళ్లుగా ఎడిటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఎన్నో వ్యయప్రయాసలుకోర్చి ఈ చిత్రం పూర్తి చేయడంతో ఎవరెస్ట్ ఎక్కినంత హాయిగా ఉందన్నారు. విలన్ పాత్ర ఇస్తాడేమోననుకున్నా: రజనీ శివాజీ తర్వాత ఏ సినిమా ఒప్పుకోలేదు. వయస్సు కూడా పెరిగింది. ఏమీ చేయకూడదు అనుకున్నాను. ఓ సందర్భంలో శంకర్ రోబో కథను టూకీగా చెప్పారు. ఆ గెటప్ నా వల్లకాదనుకున్నా. అసలు ముందుగా రోబో సినిమాను షారుక్ ఖాన్‌తో చేయాలనుకున్నారు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ శంకర్ సార్ వచ్చి నన్ను సినిమాలో నటించమని అడిగారు. ఆయన వచ్చి అందులో విలన్ పాత్ర ఉంది. అది చేయమంటారేమో... చేయనని చెప్పాలి... ఎలాగా... అని ఆలోచించాను. ఆ తర్వాత శంకర్ వచ్చి మీరు నటించాలి.. అన్నారు. ఏది ఆ విలన్ పాత్రేనా.. అని అడిగేసరికి.. కాదు సార్.. హీరోగా అన్నారు. షాక్‌కు గురయ్యాను. ఆ గెటప్స్ నా వల్లకాదు అన్నాను. మీరు ఏమీ చేయనవసరం లేదు. అన్నీ మేమే చూసుకుంటామని చెప్పారు. అలా ఆ సినిమా మొదలైంది. మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆగింది. అప్పుడు ఇండస్ట్రీలో చాలామంది నవ్వుకున్నారు. శంకర్‌కు పట్టుదల పెరిగింది. మారన్ మోరల్ సపోర్ట్‌తో సినిమా పూర్తి చేశాం. ఎన్నో చిత్రాల్లో నటించాను. కానీ ఇంత మంచి మనిషిని చూడనేలేదు. గ్రేట్ పర్సన్. 140 కోట్ల రూపాయలకుపైగా ఖర్చయినా వెనుకాడలేదు. ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. థియేటర్లలో సెలబ్రేట్ చేసుకుంటుంది అని చెప్పారు.

ఐదు శాతబ్దాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు సాగించిన తరహాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో పాలన సాగించారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల


ఐదు శాతబ్దాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు సాగించిన తరహాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో పాలన సాగించారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు. ఈ తరహా పాలనను అందించే నేత రాష్ట్రంలో మరెవ్వరూ లేరన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండలో జరిగిన శ్రీకృష్ణదేవరాయల పంచ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొయిలీ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల పాలనతో దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి పాలనను పోల్చవచ్చన్నారు. శ్రీకృష్ణదేవరాయలులా వైఎస్సార్ ప్రజారంజకమైన పాలన సాగించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో పేదల పాలిట పెన్నిధిగా మారిన వైఎస్సార్ సేవలను ప్రజలు ఎల్లవేళలా గుర్తుంచుకుంటారన్నారు. శ్రీకృష్ణదేవరాయలు అన్ని కళలను ప్రోత్సహించి, జనరంజకంగా పాలన సాగించారన్నారు. అదే తరహాలోనే దివంగత నేత వైఎస్సార్ ఉత్తమమైన పాలనను అందించి, కోట్లాది మంది ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచి పోయారన్నారు.

తిరుమల కొండపై కొండత అవినీతి: చంద్రబాబు ధ్వజం

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల గిరులపై కొండంత అవినీతి జరుగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో తితిదే పాలక మండలిని ప్రక్షాళన చేసి, తిరుమల పవిత్రతను కాపాడాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

తిరుమలలో చోటు చేసుకుంటున్న అవినీతి, నగల మాయం తదితర అంశాలపై తెదేపా మహాధర్నా, పాదయాత్రను శనివారం తిరుపతిలో చేపట్టిన విషయం తెల్సిందే. ఈ మహాధర్నాలో చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రం తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. ఈ పవిత్రతను మంటగలిపేలా కొండపై అవినీతి జరుగుతోందన్నారు.

ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్.రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తిరుమల అపవిత్రంగా మారిందన్నారు. డబ్బులున్న వారికే శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తోందన్నారు. మారుమూల పల్లె ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు దర్శనభాగ్యం లభించడం లేదన్నారు. ఈ పద్దతి మారి, ప్రతి ఒక్కరికీ దర్శనం కలిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

ఇక అధిష్టానంతో జగడమే: యువ ఎమ్మెల్యేల తీర్మానం!

తమ ప్రియతమ నేత దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం చర్య తీసుకోవడం తథ్యమనే సంకేతాలు ప్రస్ఫుటంగా వస్తున్నాయి. ఇప్పటికే జగన్ వర్గీయులపై చర్యలు చేపట్టిన హైకమాండ్ తదుపరి అస్త్రాన్ని ఏకంగా జగన్‌పైనే ప్రయోగించాలని నిర్ణయించినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.

'ముల్లును ముల్లుతోనే తీయాల'న్న చందంగా కాంగ్రెస్ హైకమాండ్ సంధించే అస్త్రాన్ని ధీటుగా ఎదుర్కునేందుకు జగన్ వర్గం సిద్ధమైంది. ఇందుకోసం మాజీ మంత్రి, శాయంపేట ఎమ్మెల్యే కొండా సురేఖ ఎంచుకున్న లేఖాస్త్రం మార్గానే ఎంచుకోనుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను వివరిస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాయాలని మరికొంతమంది నేతలు నిర్ణయించారు.

అసెంబ్లీకి తొలిసారి ఎంపికైన యువ ఎమ్మెల్యేలలో సింహ భాగం జగన్ వైపుకు మొగ్గు చూపుతున్నారు. వీరంతా కొండా సురేఖ బాటను ఎంచుకోవాలని తీర్మానించినట్టు సమాచారం. కొంతమంది వృద్ధ నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని, వీరికి చెక్ పెట్టి హైకమాండ్ కళ్లు తెరిపించేందుకు ఈ లేఖాస్త్రాలను సంధించాలని వారు నిర్ణయించారు. ఏది ఏమైనా.. కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాలు ముదిరి పాకాపడ్డాయని చెప్పవచ్చు.

Friday, August 6, 2010

మెగాస్టార్ రిఎంట్రీ ????



చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని బలోపేతం చేయాలన్న దిశలో ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మహిళలతోనూ, తన అభిమానులతోనూ సమావేశమయ్యారు. మహిళా కార్యకర్తలు అభ్యర్థనలను, ఆకాంక్షలను ఓపిగ్గా విన్నారు. మహిళల గొంతును ప్రజారాజ్యం పార్టీ సమర్థవంతంగా వినిపిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రోజురోజుకీ మహిళలపై జరుగుతున్న దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయడం ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. మహిళా రక్షణకు ఉన్న చట్టాలను సమర్థవంతంగా అమలయ్యే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుక వస్తామన్నారు. అనంతరం అభిమానులతో చిరంజీవి సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో తన ఫ్యాన్స్, యూత్ పవర్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేక పోయానని అన్నారు. ఈసారి మా ఫ్యాన్స్ టైగర్స్ తమ సత్తా ఏమిటో పీఆర్పీ ద్వారా నిరూపిస్తారని, ఇందుకోసం నిత్యం వారితో టచ్‌లో ఉంటానని చిరంజీవి పేర్కొన్నారు. ఆ సమయంలో ఫ్యాన్స్ ,"అన్నా.. నీ స్టెప్స్‌ను మళ్లీ చూడాలనిపిస్తోంది. సినిమా చేయవూ..." అంటూ నినాదాలు చేశారు. అభిమానుల ఉత్సాహానికి తగ్గట్టే చిరు ప్రతిస్పందించారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. అభిమానుల కోరిక అంత బలీయంగా ఉంటే... ఏమో.. చూద్దాం.. అన్నారు కానీ ఈ రోజు జరిగిన తమిళ సూపర్ స్టార్ రజిని కాంత్ రోబో ఆడియో విడుదల కార్య క్రమం లో అయన మాటలాడుతూ రోబో ట్రైలర్ చుసిన తరువాత నాకు శంకర్ డైరక్షన్ లో సినిమా కి అవకాశం వస్తే చేయాలనీ వుంది అంటూ అయన మనసులో మాట చేపకనే చెప్పారు ఏది ఏమైనా అభిమనుకు ప్రజలకు దాదాపు సందేహాలు తిరిపోయాయి

రామగోపాల్ వర్మ రక్త చరిత్ర

Thursday, August 5, 2010

The Last Shot

I took the last shot of ‘Rakht Charitra’ yesterday. From the inception of the idea of wanting to make ‘Rakht Charitra’ till the point of me taking the last shot was an incredible journey for both my mind the way it started perceiving and understanding the research material and then also how it studied the minds of the various involved parties. So a constant analysis and thereby a due course of me being psyched up by what kind of conclusive truths I have reached in various mental states of mine resulted in a situation that by the time I reached the last shot it made me truly believe that what I shot in Cinema is real and what happened in real was Cinema.

Wednesday, August 4, 2010

ప్రజాస్వామ్యమా.. కాంగ్రెస్‌లో నీవెక్కడా: అంబటి రాంబాబు

కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందో లేదో తెలియని సందిగ్ధావస్థలో తాము ఉన్నట్టు సస్పెండ్‌కు గురైన పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ఎవరిని ఎందుకు తీసేస్తున్నారో వివరణ ఇచ్చుకోలేని స్థితిలో పెద్దలు ఉన్నారన్నారు. పార్టీ ప్రజాస్వామ్యం అంటే ఇదేనా ఆయన ప్రశ్నించారు.

ఆయన బుధవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ వామపక్షాల ఖిల్లాగా ఉన్న ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఐదు స్థానాలను అందించిన ఘనత రాజశేఖర రెడ్డికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడంలో తమతో పాటు అనేక మంది పార్టీ కార్యకర్తల సహకారం ఉందని అంబటి చెప్పుకొచ్చారు.

అయితే, ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా, పార్టీ శ్రేణులకు చెడు సంకేతాలను పంపేలా ఉన్నాయన్నారు. తనను సస్సెండ్ చేసినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి.. కానీ తనకు అధికారికంగా ఎలాంటి పత్రాలు అందలేదని గుర్తు చేశారు.

అలాగే, కాంగ్రెస్ అనుబంధ సంస్థ కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి గట్టు రామచంద్రరావును తొలగించినట్టు తాజాగా వార్తలు వచ్చాయి. ఆయనకు కూడా స్పష్టమైన ఆదేశాలు అందలేదన్నారు. ఏది ఏమైనా.. కొంతమంది పెద్దలు అంటే ముఖ్యమంత్రి స్థాయి వంటి నేతల ఒత్తిడి, ప్రోద్భలంతోనే ఈ తరహా చర్యలు చేపడుతున్నారన్నారు.

ఇలాంటి చర్యలు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో మనుగడ సాగించేలా చేస్తాయా, వైఎస్.రాజశేఖర రెడ్డి, వైఎస్.జగన్మోహన్ రెడ్డి పేర్లను ప్రస్తావించకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగగలదా అని ప్రశ్నించారు. వైఎస్ జపం చేయడాన్ని నేరంగా భావించి తమపై కక్ష చేపడుతున్నట్టుగా ఉందన్నారు. ఏది ఏమైనా.. తమకు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత పెద్దలపై ఉందని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డా


ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న జగన్ వర్గీయులకు కాంగ్రెస్ అధిష్ఠానం తన పవర్‌ను క్రమంగా రుచి చూపిస్తోంది. నోటికి తాళాలు వేస్తోంది. కాంగ్రెస్‌లోనే ఉంటూ ఓవైపు "జై జగన్" అంటూనే మరోవైపు "వీక్ రోశయ్యా" అంటూ చెణుకులు విసురుతూ దూకుడు వ్యాఖ్యలు చేసిన అంబటిపై తొలి అస్త్రాన్ని సంధించిన కాంగ్రెస్ హైకమాండ్ తాజాగా కొండా సురేఖపై ఎక్కుపెట్టింది.

మహావృక్షంలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన కొమ్మల్లాంటి నేతలను తొలగిస్తూ కాంగ్రెస్ పార్టీని బలహీన పరుస్తున్నారని కొండా సురేఖ తన 11 పేజీల సుదీర్ఘ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్రంలో ఇపుడున్నది బహు బలహీనమైన నాయకత్వమనీ, అందువల్లనే కాంగ్రెస్ పార్టీ గందరగోళంలో కొట్టుమిట్టాడుతోందని తెలిపింది.

అన్నిటికీ మించి అసలు తాము స్వపక్షంలో ఉన్నామో విపక్షంలో ఉన్నామో అర్థంకాని అయోమయ స్థితిలో ఉన్నామని పేర్కొనడాన్ని కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఫలితంగానే కొండాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

అధిష్ఠానం పంపిన షోకాజ్ నోటీసుకు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వివరణ ఇచ్చుకుంటానని సురేఖ వెల్లడించింది. మరోవైపు రెండు రోజుల్లో అంబటి రాంబాబు క్రమశిక్షణా సంఘం ముందు తన వాదనలను సమర్థించుకోనున్నారు. అంబటి తాను ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారో చూద్దామన్న ధోరణిలో హైకమాండ్ ఉన్నట్లు సమాచారం.

ఇదిలావుండగా పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా వారిపై చర్య తప్పదని కాంగ్రెస్ హైకమాండ్ తన చర్యల ద్వారా హెచ్చరిస్తోంది. ప్రత్యేకించి జగన్ వర్గీయులను. ఈ సంగతి ఇలా ఉంటే బుధవారం జగన్ వర్గీయులందరూ అంబటి స్వగృహంలో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలాగూ అధిష్టానం తమను టార్గెట్ చేస్తుంది కనుక భవిష్యత్తులో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై వారు కసరత్తు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

ఏదేమైనా జగన్ వర్గానికి వరుస షాక్‌లు ఇస్తూనే ఉన్నది కాంగ్రెస్ హైకమాండ్. మరోవైపు జగన్ కాకినాడ ఓదార్పు సభలో తన సహనం ఎన్నాళ్లు ఉంటుందో తనకే తెలియదని చెప్పారు. అలా చెప్పినప్పటికీ హైకమాండ్ జగన్ మాటలను పట్టించుకున్నట్లు ఏమీ కనబడటం లేదు. హద్దు మీరితే జగన్‌పైనా గురి పెట్టడం ఖాయమని తాజా సంఘటనలనుబట్టి అర్థమవుతోంది. మరి జగన్ సహనంగానే ఉంటారో... సహనం కోల్పోతారో చూడాలి.

కొండసురేఖ కు షోకాజ్ నోటీసు

మంత్రి కొండసురేఖ కు త్వరలో షోకాజ్ నోటీసు లు జారి చేస్తామని పీ సి సి పరిశీలన ,దరియప్తు సంఘం కమిటి చైర్మన్ కంతేటి సత్యనారాయణ రాజు మీడియా కు తెలిపారు అయితే ఈ విషయం అయన అధికారికంగా వివరించలేదు అంబటి రాంబాబు వాదన లు కూడా వింటామని అయన తెలిపారు రోశయ్య తో అయన సమవేసమయిన సందర్బం గా మీడియా తో మాటలాడరు .ఇది జగన్ కు వెతిరేక౦ గా కొందరు కుట్ర పన్నుతునారని మరి కొంత మంది వాదన వై ఎస్ ఆర్ అభిమానులను పార్టీ నుంచి తప్పించే ప్రయత్నం అని కొందరు అభిప్రాయపడుతున్నారు అదే ఎం అయ్యిన జగన్ ప్రజాదరణ వుంది అని కాబట్టి జగన్ కు నష్టం లేదు అని జగన్ వర్గం స్పష్టం చేస్తోంది .వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ లో ఆధిపత్యపోరు మరియు సమన్వయలోపం స్పష్టం గా కనిపిస్తునాయి ఇలాగే కొనసాగితే భావిస్యతు లో కాంగ్రెస్ కు తిప్పలు తప్పవు

Tuesday, August 3, 2010

రాజకీయ సంక్షోభం వస్తే ఆదుకుంటా: చిరు అభయ హస్తం


రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజుకో విధంగా మారిపోతున్న నేపధ్యంలో ఒకవేళ రాజకీయ సంక్షోభం తలెత్తితే ప్రజలపై భారం పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రజారాజ్యం పార్టీపై ఉన్నదని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. అలా చెప్పడం ద్వారా కాంగ్రెస్ సర్కార్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కూలనివ్వబోనన్న దృఢ సంకల్పంతో చిరు ఉన్నట్లు అర్థమవుతోంది.

ఇటీవల రాజ్యసభ ఎన్నికల సమయంలో సోనియా గాంధీతో సమావేశమైన తర్వాత నుంచి చిరంజీవి క్రమంగా కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా మెలగుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలోనూ రోశయ్యకు చేదోడు వాదోడుగా ఉంటూ దాదాపు కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి మద్దతు పలుకుతున్నారు.

అయితే అప్పుడప్పుడు కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై ధ్వజమెత్తుతున్నారు. తాజాగా బార్‌ల ఏర్పాటు విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. జనభా ప్రాతిపదికన పాఠశాలలు, ఆస్పత్రులు ఏర్పాటు చేయకుండా బార్లను ఏర్పాటు చేయడం శోచనీయమని చిరు ఆవేదన వ్యక్తం చేశారు.

మొత్తమ్మీద చిరంజీవి చాలా త్వరగానే రాజకీయ క్రీడలను ఆకళింపు చేసుకున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.