Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Wednesday, April 20, 2011

ntr wedding card








Saturday, April 9, 2011

NENU NA RAKSHASHI TRILER

Wednesday, April 6, 2011

బహుభాషానటి సుజాత కన్నుమూత


చెన్నై: కుటుంబ కథా చిత్రాలతో తెలుగు సినీ అభిమానుల్ని ఆకట్టుకున్న నటి సుజాత చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు. కొంతకాలంగా సుజాత అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. తమిళ, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 300 చిత్రాల్లో పైగా నటించారు. ఆమె నట జీవితంలో ఎక్కువగా కమల్ హసన్‌తో నటించారు. సుజాత 10 డిసెంబర్ 1952 రోజున శ్రీలంకలో జన్నించారు. 2006 సంవత్సరంలో విడుదలైన శ్రీరామదాసు చిత్రంలో సుజాత చివరిసారిగా తెరపై కనిపించింది. గోరింటాకు, ఏడంతస్తుల మేడ, నీకునేను నాకు నువ్వు, విలన్, బాబా, తప్పు చేసి పప్పు కూడు, పెళ్లి, సూరిగాడు, చంటి, సూత్రదారులు, అగ్నిగుండం, అనుబంధం, ఎమ్యెల్యే ఏడుకొండలు, సీతాదేవి, సర్కస్ రాముడు, గుప్పెడు మనసు, ప్రేమతరంగాలు చిత్రాల్లో నటించారు. హిందీ చిత్రం ఏక్ హీ బూల్‌లో కూడా సుజాత నటించారు. తమిళంలో కాదలన్ మీంగల్, అన్నాకిలి, అవల్ ఓరు థోడర్ కథై, ఎర్నాకులం జంక్షన్, వాజుతుత కట్టుకిరెన్ చిత్రాల్లో నటించారు. సుజాత మృతి తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Monday, April 4, 2011

Badrinath wall papers !!








Click on the above thumbnail for larger size

Sunday, April 3, 2011

ఫైనల్ మ్యాచ్‌కు రికార్డు స్థాయి వీక్షకులు

న్యూఢిల్లీ: భారత, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో క్రికెట్ అభిమానులు వీక్షించారు. 67.6 మిలియన్ వీక్షకులు ఈ మ్యాచ్‌ను చూడటానికి టెలివిజన్ సెట్లకు అత్తుకుపోయారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ రేటింగ్ అని ఆడియన్స్ మెజర్‌మెంట్ అండ్ అనలిటికల్ లిమిటెడ్ తెలిపింది. ఫైనల్ మ్యాచ్‌కు 13.7 పాయింట్ల రేటింగ్‌ను నమోదు చేసుకుంది. ఓ దశలో రేటింగ్ 21.44 పాయింట్లకు చేరుకుందని ఆ సంస్థ వెల్లడించింది. ఇప్పటి వరకు అత్యధికంగా చూసిన మ్యాచ్‌గా రికార్డును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌ను చూసిన వారిలో అత్యధికంగా 64 శాతం మంది ఇంటి వద్ద నుంచే చూసినట్టు గణాంకాలు వెల్లడించాయి.
source:sakshi

180 Teasers &trilers


Saturday, April 2, 2011

2011 విశ్వ విజేత భారత్


ముంబై: యావత్ భారతావని కల తీరింది. 28 ఏళ్ల తరువాత తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంటూ ధోని సేన ప్రపంచకప్ గెలవడంతో భరతమాత పులకించి పోయింది. 275 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించింన టీమిండియా తన ఖాతాలో 2011 వరల్డ్‌కప్ గెలుచుకుని తన బ్యాటింగ్‌కు తిరుగులేదని ప్రపంచానికి చాటి చెప్పింది. బౌలింగ్ విభాగంలో అత్యంత పటిష్టంగా శ్రీలంకను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించి తన బ్యాటింగ్ పంచ్‌తో ఆకట్టుకుంది.శ్రీలంక -భారత్‌లు తమ బ్యాటింగ్ విన్యాసాలతో ముంబై వాంఖేడ్ స్టేడియం తడిసి ముద్దయ్యినా.. తన సొంత టీమ్ విజయం సాధించడంతో వాంఖేడ్ స్టేడియం ఆనంద పరవళ్లు తొక్కింది.


భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ధోని గ్యాంగ్ ఆదిలో తడబడి.. టీమిండియా అభిమానుల్లో ఒకింత కలవరం రేపింది. ఇన్నింగ్స్ ఆరంభించిన రెండో బంతికే సెహ్వాగ్‌ను మలింగా బలికొనడంతో ఒక్కసారిగా స్టేడియంలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. గంభీర్-సచిన్‌లు ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే సమయంలో సచిన్‌ను 18 పరుగుల వద్ద అదే బౌలర్‌ పెవిలియన్‌కు పంపిచడంతో భారత్ గెలుపుపై సందేహం ఏర్పడింది.

ప్రపంచ బ్యాటింగ్ లైనప్‌లో అత్యంత పటిష్టటంగా ఉన్న భారత్‌ను నిలువరించడం సంగాక్కరా సేనకు భారంగా పరిగణి ంచింది. సచిన్ అవుటయిన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ-గంభీర్‌లు 83 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్‌కు ఎదులేకుండా పోయింది. కోహ్లీ 34 పరుగులు చేసిన దిల్షాన్ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరగడంతో.. ఆ స్థానాన్ని ధోని భర్తీ చేశాడు. గంభీర్ 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ కోల్పోగా.. ధోనీ(91) హాఫ్ సెంచరితో తను ఎంతో విలువైన ఆటగాడ్నో మరోసారి రుజవు చేశాడు. లంక బౌలర్లలో మలింగా రెండు వికెట్లు తీయగా, దిల్షాన్, పెరీరాలు తలో వికెట్టు సాధించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకేయులు జయవర్ధనే సహకారంతో 274 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు విసిరింది.